E-Paper
Advertisement

NIA Raids in Chennai: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ కేసు.. చెన్నైలో ఎన్ఐఏ దాడులు..!

NIA Raids in Chennai: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ కేసు.. చెన్నైలో ఎన్ఐఏ దాడులు..!
Advertisement
rameswaram cafe blast nia raid
rameswaram cafe blast nia raid

NIA Raids in Chennai for Bengaluru Cafe Blast Suspects: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం ఉదయం చెన్నైలోని మూడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి 1న పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులు చెన్నైలో మకాం వేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో దాడులు ప్రారంభించారు.

ఇప్పటికే కీలక నిందితుడిని గుర్తించిన కేంద్ర ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థ అతడి ఆచూకీ కోసం గాలిస్తోంది. నిందితులు క్యాప్, మాస్క్ ధరించి ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

మార్చి 23న.. కర్ణాటకలోని తీర్థహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన కీలక నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్‌ను గుర్తించినట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితుడిని గుర్తించేందుకు ఏజెన్సీ 1,000 సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది.

పేలుడు వెనుక శివమొగ్గ ఐఎస్‌ఐఎస్‌ మాడ్యూల్‌ హస్తం ఉండొచ్చని దర్యాప్తు సంస్థ వర్గాలు ముందుగా తెలిపాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ఈ మాడ్యూల్‌కు చెందిన 11 మంది కర్ణాటకలోని తీర్థహళ్లిలో రాడికల్‌గా మారారు. ఆ తర్వాత వారు గత కొన్నేళ్లుగా దక్షిణ భారతదేశంలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించారు.

Advertisement

Also Read: ఫ్యామిలీలో చిచ్చురేపిన ఐపీఎల్ బెట్టింగ్, ఉమెన్ సూసైడ్.. ఎలా జరిగింది?

బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి ఎన్ఐఏ రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అనుమానితుడి సీసీటీవీ చిత్రాలు, వీడియోలను కూడా విడుదల చేసింది. మార్చి నెల ప్రారంభంలో కర్ణాటక హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వర ఈ ఘటనపై మాట్లాడుతూ దర్యాప్తు బృందాలు నిందితులపై ఫోకస్ పెట్టాయని తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×