E-Paper
Advertisement

Update on Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్..!

Update on Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్..!
Advertisement

Rameshwaram Cafe Blast Suspects Arrest: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి మతీన్ తాహాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అర్సెట్ చేసింది. రామేశ్వరంలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఇద్దరూ అస్సాం, పశ్చిమబెంగాల్ లో దాక్కున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. నిందితులను ఒక క్యాప్ పట్టించింది.

Also Read : యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. వెంటనే అప్లై చేసేయండి.. పరీక్ష ఎప్పుడంటే?

Advertisement

నిందితులు క్యాప్ కొనేందుకు ఒక షాప్ కు వెళ్లగా.. అక్కడి సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని గుర్తించారు. తరచూ సిమ్ కార్డులను మార్చుతూ.. పోలీసులకు దొరక్కుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినా.. రాడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు.. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి ఫారెస్ట్ విభాగంలో కొందరికి ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది.

కాగా.. ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది గాయపడ్డారు. నిందితుడు ఇడ్లీ తిని.. తన చేతిలోని బాంబు బ్యాగ్ ను అక్కడే వదిలి వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. ఆ సమయంలో నిందితుడు టోపీ ధరించి ఉన్నాడు. ఆ టోపీ ఆధారంగా దర్యాప్తు చేసిన బృందాలు.. అతను కొనుగోలు చేసినప్పటి దృశ్యాలను కనుగొన్నారు. వాటి ఆధారంగానే నిందితులను అరెస్ట్ చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×