E-Paper
Advertisement

New Born Babies : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. ఒక్క రాష్ట్రంలోనే 500 మంది శిశువుల జననం..

New Born Babies : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. ఒక్క రాష్ట్రంలోనే 500 మంది శిశువుల జననం..
Advertisement

New Born Babies : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముగ్ధమనోహర రూపంలో బాలరాముడు.. అందరినీ ఆకర్షిస్తున్నాడు. సరిగ్గా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయానికే కొందరు గర్భిణులు.. ప్రసవం జరగాలని కలలు కన్నారు. ఈ మేరకు ముందుగానే సిజేరియన్లకు రెడీ అయ్యారు. కోరుకున్నట్లుగానే.. ప్రాణప్రతిష్ఠ జరిగిన దివ్యముహూర్తంలోనే బిడ్డల్ని కని.. ఆ బుజ్జాయిల ముఖాలను చూసి సాక్షాత్తూ ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని మురిసిపోయారు.

అభిజిత్ లగ్నంలో పెట్టిన దివ్యముహూర్తంలో పుట్టిన మగబిడ్డలకు రామ్ అని, ఆడపిల్లలకు సీత అని పేర్లు పెట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఫర్జానా అనే ముస్లింమహిళ.. తన బిడ్డకు రామ్ రహీమ్ అని పేరుపెట్టింది.

Advertisement

ఇదిలా ఉంటే.. జనవరి 22న నిశ్చయించిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో బీహార్ లోని పట్నాలో ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో ఏకంగా 500 మంది తల్లులకు ప్రసవం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మధ్యప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో వివిధ ఆస్పత్రుల్లో సోమవారం 47 మంది జన్మించినట్లు సమాచారం. యూపీలోని కాన్పుర్ గణేశ్ శంకర్ ఆస్పత్రిలో 25 మందికి కాన్పులు జరిగినట్లు వైద్యులు తెలిపారు. చాలామంది తమ బిడ్డలకు రామ్, రాఘవ్, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర వంటి పేర్లు పెట్టుకున్నారు. ఇక కర్ణాటక విజయపురలో జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం 20 మందికిపైగా మహిళలకు కాన్పులు జరిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×