E-Paper
Advertisement

NTCA Data : పులుల దాడుల్లో 349 మంది మృతి.. నివేదిక విడుదల చేసిన NTCA

NTCA Data : పులుల దాడుల్లో 349 మంది మృతి.. నివేదిక విడుదల చేసిన NTCA
Advertisement

NTCA Data : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలిపింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో పులుల మరణాలు పెరిగినట్లు నివేదికలో వివరించింది. వేట, అనారోగ్యం, వివిధ కారణాల వల్ల 628 పులులు చనిపోగా.. పులుల దాడిలో గత ఐదేళ్లలో 349 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. చనిపోయినవారిలో 200 మంది మధ్యప్రదేశ్ వాళ్లే ఉన్నట్లు తెలిపింది. 2023లో పులుల మరణాలు పెరిగినట్లు తెలిపింది.

NTCA రిపోర్ట్ ప్రకారం.. 2019లో 96 పులులు చనిపోగా.. 2023కి ఈ సంఖ్య 178కి పెరిగింది. 2012 నుంచి చూస్తే.. 2023లోనే అత్యధికంగా పులుల మరణాలు సంభవించాయి. పులుల దాడిలో 2019, 2020లో 49 మంది, 2021లో 59 మంది, 2022లో 110 మంది, 2023లో 82 మంది మరణించారని కేంద్రపర్యావరణశాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం భారతదేశంలో 3,682 పులులు ఉండగా.. ఇది ప్రపంచ అడవి పులుల సంఖ్యలో 75 శాతం అని NTCA వెల్లడించింది. దేశంలో 1973లో పులుల సంరక్షణకోసం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది ప్రభుత్వం. అప్పుడు 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ లు ఉండగా.. 78,735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 55 టైగర్ రిజర్వ్ లను కలిగి ఉంది. మొత్తం భూభాగంలో 2.4 శాతం పులుల కోసమై కేటాయించారు.

 

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×