E-Paper
Advertisement

వర్షం ఎఫెక్ట్.. ముంబై రైల్వేస్టేషన్లలో భారీ రద్దీ.. మహానగరానికి ‘రెడ్ అలర్ట్’!

వర్షం ఎఫెక్ట్.. ముంబై రైల్వేస్టేషన్లలో భారీ రద్దీ.. మహానగరానికి ‘రెడ్ అలర్ట్’!
Advertisement

Mumbai Rains: ముంబై మహానగరాన్ని వరుణుడు మరోసారి వణికించాడు. గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాణిజ్య రాజధాని అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా, ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో రానున్న రోజుల్లో మరింత ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

జలమయమైన అంధేరి.. స్తంభించిన రవాణా

Advertisement

నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా ముంబైలోని కీలక ప్రాంతమైన అంధేరి సబ్‌వేతో పాటు ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాలు నడపలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ మైళ్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక నరకయాతన అనుభవించారు.

Also Read: కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి

Advertisement

రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల నరకం

రోడ్డు రవాణా దెబ్బతినడంతో అందరూ లోకల్ రైళ్ల వైపు పరుగులు తీశారు. అయితే, ముంబై లైఫ్ లైన్ అయిన లోకల్ రైళ్లు కూడా వర్షం ధాటికి చాపచుట్టేశాయి. సాంకేతిక కారణాల వల్ల రైళ్లు కేవలం 30 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నప్పటికీ, ఆ కాస్త సమయానికే రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా బోరివళి వంటి ప్రధాన స్టేషన్లలో జనం పోటెత్తారు. ప్లాట్‌ఫారాలపై కాలు పెట్టేందుకు కూడా చోటు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రయాణికుల డిమాండ్

ప్రతి ఏటా వర్షాకాలం రాగానే ముంబైలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని నగరవాసులు మండిపడుతున్నారు. ముంబై లాంటి మెట్రో నగరంలో వర్షాల వల్ల రైల్వే వ్యవస్థ ఇంతలా దెబ్బతినడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, వర్షాకాలంలో కూడా రైళ్లు, ఇతర రవాణా వ్యవస్థలు సజావుగా సాగేలా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవు.. పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక

వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’

ఇదిలా ఉంటే, ముంబై ప్రజలకు వాతావరణ శాఖ మరో చేదు వార్త చెప్పింది. రానున్న రోజుల్లో నగరంలో మరింత తీవ్రస్థాయిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ముంబైకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×