E-Paper
Advertisement

Modi : త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..

Modi : త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..
Advertisement

Modi : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రసంగం చేశారు.

కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయని తెలిపారు. పాత పార్లమెంట్ లో తగినన్ని సీట్లు లేవని, సాంకేతిక సమస్యలున్నాయన్నారు. కొత్త పార్లమెంట్ కేవలం భవనం కాదన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింబంగా పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్‌ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్త భవనం ఇస్తుందని స్పష్టం చేశారు. స్వతంత్ర సమరయోధుల కలల సాకార మాధ్యమంగా ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఈ భవననం నిలుస్తుందన్నారు

Advertisement

దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయన్నారు మోదీ. అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. నవ భారత్‌ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోందని చెప్పారు. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్‌ ప్రగతి పథాన పయనిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని మోదీ పేర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×