E-Paper
Advertisement

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..
Advertisement

Modi : కర్నాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. తాజాగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేపట్టారు. న్యూ తిప్పసాంద్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్‌ వరకు ఈ రోడ్ షో చేపట్టారు.

ప్రధాని చేపట్టిన రెండో రోడ్‌ షో ఇది. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు. నీట్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రెండో రోడ్‌ షోను 10 కిలోమీటర్లతో సరిపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. దక్షిణ కర్ణాటకలో కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా రోడ్‌ షో చేపట్టారు.

Advertisement

ప్రధాని శనివారం 28 కిలోమీటర్లు రోడ్ షో చేశారు. 18 నియోజకవర్గాలను చుట్టేశారు. బాదామి, హావేరిలకు వెళ్లిన మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న బిడ్డ ప్రపంచమే గుర్తించేలా దేశాన్ని నిలబెట్టారంటే అందుకు కారణం తాను కాదని ప్రజలు వేసిన ఓటేనని ప్రకటించారు.

కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సోమవారంతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. అటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×