E-Paper
Advertisement

Modi : అమృత్ భారత్ పథకం.. ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..

Modi : అమృత్ భారత్ పథకం..  ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..
Advertisement

Modi: దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ అన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని 39 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, గేమింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. దీంతో ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయని తెలిపారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌లో ఎంపీ బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు.

Advertisement

అమృత్‌ భారత్‌ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలో 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తారు. తెలంగాణలో రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడతారు. హఫీజ్‌పేట, హైటెక్‌ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, మలక్‌పేట, మల్కాజిగిరి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, రామగుండం, కాజీపేట, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్‌, మహబూబ్‌నగర్‌, తాండూరు, యాదాద్రి , జహీరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్టేషన్లు అభివృద్ధి చేస్తారు.

ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లను అభివృద్ధి చేస్తారు. పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ,తుని, కాకినాడ టౌన్‌, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ, కర్నూలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×