E-Paper
Advertisement

Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్

Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్
Advertisement

Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు లాయర్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈక్రమంలో ఈడీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేశారు.

ఇక ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న వారితో కలిసి కవితన ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై, మనిశ్ సిసోడియాను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

మరోవైపు కవితకు నైతిక మద్ధతు తెలియజేయడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఢిల్లీలోని కవిత నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. న్యాయనిపుణులతో కేటీఆర్ భేటీ కానున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×