E-Paper
Advertisement

Ministers To Meet Farmers: ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..

Ministers To Meet Farmers: ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..
Advertisement

Ministers To Meet Farmers: పంజాబ్ రైతులు ఫిబ్రవరి 13, మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో తలపెట్టిన మహాధర్నా నిరసనని అపేందుకు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్, నిత్యానంద రాయ్ చంఢీగడ్ తరలివెళ్లారు. అక్కడ రైతు నేతలతో పరిష్కారం కోసం చర్చలు జరుపుతారని సమాచారం.

మూడేళ్ల క్రితం వ్యవసాయం చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్ రైతులు నెలల తరబరి చేసిన ధర్నా వల్ల మోదీ ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికల దృష్ట్యా మరోసారి అలాంటి ధర్నా జరగకుండా ఉండేందుకు బీజేపీ మంత్రులు.. రైతుల వద్దకు చర్చలు జరిపేందుకు పరుగులు తీశారు.

Advertisement

కనీస మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం, పంట బీమా, రైతు బీమాలు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు కోసం ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఫిబ్రవరి 13న రైతు ట్రాక్టర్ మార్చ్ నిరసన భారీ స్థాయిలో చేపట్టనున్నారు.

అలాగే 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

మరోవైపు ఢిల్లీ-నోయిడా సరిహద్దులో రెండు రోజులుగా ఉత్తర ప్రదేశ్ రైతుల నిరసన జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న తమ భూములకు బదులుగా పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×