E-Paper
Advertisement

Nagpur News: నాగ్‌పూర్‌లో డీజే సౌండ్ బాంబ్.. పలువురికి గాయాలు

Nagpur News: నాగ్‌పూర్‌లో డీజే సౌండ్ బాంబ్.. పలువురికి గాయాలు
Advertisement

Nagpur News: ఇటీవల చిన్న పార్టీ నుంచి మొదలుకుని పెళ్లిళ్ల వరకు డీజే లేకుండా అస్సలు జరగడం లేదు. ఏ ఫంక్షన్ అయినా సరే బ్యాండ్ బాజాలు మోగాల్సిందే. పాట లేనిదే ఏ ఫంక్షన్ కూడా జరగడం లేదు. అంతేకాదు డీజే ఉంటే తప్పా అసలు ఫంక్షన్ కే రావడం కుదరదని చెప్పే బంధువులు కూడా ఉంటున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు చిందులేసేందుకు సై అంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే డీజే వల్ల చాలా సార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

డీజే కారణంగా చాలా గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ఘటనలు చాలా సహజమే కానీ డీజే కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. డీజే నుంచి వైబ్రేషన్స్ కారణంగా ఒక గోడ కూలి పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని నాగ్ పూర్ లో వెలుగుచూసింది.

Advertisement

ఓ ఇంటి వద్ద డీజేను ప్లే చేశారు. ఈ తరుణంలో ఆ ఇంటికి ఆనుకుని ఉండే ఒక్కసారిగా డీజే నుంచి వచ్చిన వైబ్రేషన్స్ కారణంగా కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న పలువురు స్థానికులు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారికి తీవ్ర రక్త స్రావం కూడా జరిగింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే డీజే కారణంగా జరిగిన ఈ ప్రమాదానికి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డీజేను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీజే కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని అంటున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×