E-Paper
Advertisement

Bus Accident In UP: బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం

Bus Accident In UP:  బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం
Advertisement

Bus Accident In UP

Bus Accident In UP: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గాజీపూర్ జిల్లాల్లో బస్సుపై హైటెన్షన్ కరెంట్ వైరు తెగి పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు 35 మంది పెళ్లి బృందంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంత సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని గాజీపూర్ జిల్లా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

Advertisement

బస్సులో మంటల చెలరేగగానే స్థానికులు స్పందించారు. వెంటనే బస్సు వద్దకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే బస్సు దగ్ధమైంది.

Read More: కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదం.. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్..

Advertisement

ప్రమాద సమయంలో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదంతో పెళ్లింట విషాదం నెలకొంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×