E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన నిరుద్యోగం.. కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన నిరుద్యోగం.. కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే
Advertisement
Mallikarjun Kharge
Mallikarjun Kharge

Mallikarjun Kharge on Jobs during Lok Sabha Elections 2024: బీజేపీ పాలనలో దేశంలోని నిరుద్యోగం భారీ స్థాయిలో పెరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రధాని మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే యువతకు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశంగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు లభించక విసిగివేసారుతున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఐఐటీల్లో 30 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని, 21 ఐఐఎంల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే వేసవి ప్లేస్ మెంట్స్ పూర్తి అయ్యాయని ట్వీట్టర్(ఎక్స్)లో వెల్లడించారు.

Advertisement

ఎంతో ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంల్లో పరిస్థితే ఇలా ఉంటే దేశవ్యాప్తంగా యువత భవిష్యత్ ను బీజేపీ ఎలా నాశనం చేసిందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2014 నుంచి మోదీ హయాంలో యువతలో నిరుద్యోగం మూడు రెట్లు ఎక్కువైందన్నారు.

Also Read: భారీగా నోట్ల కట్టలు, వాళ్లు బీజేపీ కార్యకర్తలా? నాలుగు కోట్లు సీజ్

Advertisement

మోదీ ప్రభుత్వం యువతకు తప్పుడు హామీలు ఇవ్వడం ద్వారానే దేశంలో నిరుద్యోగం ఇంతలా పెరిగిపోయిందని విమర్శించారు. ఇటీవలే వెల్లడైన భారత ఉద్యోగ నివేదిక ప్రకారం.. ఏటా 70-80 లక్షల మంది శ్రామిక శక్తిలో పాలు పంచుకుంటున్నారని వెల్లడైందన్నారు. 2012, 2019 మధ్య ఉద్యోగాల్లో వృద్ధి కేవలం 0.01 శాతంగా ఉందన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×