E-Paper
Advertisement

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం
Advertisement

Fire Accident: శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని బెంగాలీ బస్తి అనే స్లమ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం గురించి రాత్రి 10:56 గంటల సమయంలో ఢిల్లీ అగ్నిమాపక సేవల శాఖకు సమాచారం అందింది. అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, తక్షణమే 15 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. తర్వాత మంటలు ఎక్కువగా విస్తరించే ప్రమాదం ఉండటంతో మరో 14 యంత్రాలు కూడా చేరాయి.. దీంతో మొత్తం 29 యంత్రాలు పనిచేశాయి. అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు కష్టపడి, శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అగ్నిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రాంతం రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక దట్టమైన స్లమ్ క్లస్టర్, ఇక్కడ వందలాది మంది కూలీలు, పేదలు తాత్కాలిక గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. అయితే ప్రస్తుతం అగ్ని వేగంగా వ్యాపించడానికి కారణం, ప్రమాద స్థలంలో ఉన్న అనేక LPG సిలిండర్లు కారణమంటున్నారు. ఈ పేలుళ్లు అగ్నిని మరింత తీవ్రతరం చేసి, పొగలు దట్టంగా ఏర్పడటానికి, నివాసుల్లో భయం వ్యాపించడానికి దారితీశాయి. నివాసులు తమ వస్తువులు కాపాడుకునేందుకు, భద్రతయుతంగా తరలి వెళ్లేందుకు గందరగోళంగా పరిగెత్తారు.

Advertisement

ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడు మున్నా(30)గా గుర్తించారు. అయితే ఈ వ్యక్తి శవం ఆహార గుడిసెలో కనిపెట్టారు. ఇక ఒక 5 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డాడు. బాలుడి పరిస్థితి స్థిరంగా ఉందని, మరిన్ని మరణాలు లేదా గాయాలు రిపోర్ట్ కాలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఘటన స్థలాంలో ఎక్కువగా జనాలు సమీపించకుండా చూస్తున్నారు.

Also Read: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు 

Advertisement

ఈ ఘటనలో ప్రాణ నష్టం తక్కువగా సంభవించిని ఆస్తి నష్టం భారీగా జరిగింది. 500 గుడిసెల వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇందులో వందలాది కుటుంబాలు తమ ఇళ్లు, సామానులు కోల్పోయారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఎక్కువగా బెంగాలీ మూలాల కార్మికులు, వారి ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. అగ్నిప్రమాద కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు, కానీ LPG సిలిండర్ల పేలుళ్లు ముఖ్య కారణంగా చెబుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×