E-Paper
Advertisement

Mumbai: పవార్‌ను చంపేస్తాం.. రౌత్‌ను లేపేస్తాం.. వార్నింగ్ బెల్స్..

Mumbai: పవార్‌ను చంపేస్తాం.. రౌత్‌ను లేపేస్తాం.. వార్నింగ్ బెల్స్..
Advertisement
sharad sanjay

Mumbai: నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను చంపేస్తామంటూ కొందరు దుండుగులు బెదిరింపులకు దిగారు. పవార్‌ను హత్య చేస్తామని ట్విట్టర్‌లో బెదిరించారు. ఈ బెదిరింపులపై శరద్ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ముంబై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తన తండ్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ట్విట్టర్‌లో కొందరు బెదిరించారని.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శరద్‌ పవార్‌కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement

మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్‌లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కాల్స్ ద్వారా కొందరు దుండగులు బెదిరించారని సునీల్ రౌత్ తెలిపారు. మీడియాతో మాట్లాడవద్దని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌కు, తనకు హత్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ ఘటనపై ముంబై పోలీస్ కమిషనర్, రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించామని సునీల్ రౌత్ తెలిపారు.

సుప్రీయా ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. FIR నమోదు చేసి.. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తిస్తామన్నారు ముంబై పోలీసులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×