E-Paper
Advertisement

Land for Jobs Scam | లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు

Land for Jobs Scam | బిహార్ ప్రధాన రాజకీయ పార్టీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్‌ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ (రైల్వే ఉద్యోగానికి బదులుగా భూమి) కేసులో డిసెంబర్ 22న తేజస్వీ యాదవ్ , 27న ఆయన తండ్రి లాలూ యాదవ్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Land for Jobs Scam | లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు
Advertisement

Land for Jobs Scam | బిహార్ ప్రధాన రాజకీయ పార్టీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్‌ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ (రైల్వే ఉద్యోగానికి బదులుగా భూమి) కేసులో డిసెంబర్ 22న తేజస్వీ యాదవ్ , 27న ఆయన తండ్రి లాలూ యాదవ్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈ కేసులో వ్యాపారవేత్త అమిత్‌ కత్యాల్‌ను నవంబర్ నెలలోనే ఈడీ అరెస్టు చేసింది. అమిత్‌ కత్యాల్‌కు లాలూ యాదవ్, తేజస్వీ యాదవ్‌కు సన్నిహిత సంబంధాలుడడంతో ఆయనను అరెస్టు చేసింది. అయితే బిహార్ ఉపముఖ్యమంత్రి
తేజస్వీ యాదవ్‌ను ఏప్రిల్‌ నెలలోనే ఈడీ విచారణ చేసింది. తాజాగా లాలూ ప్రసాద్‌తోపాటు మరోసారి తేజస్వీ కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

Advertisement

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదు కావడంతో ఇద్దరు నాయకుల వాదనలను ఈడీ రికార్డు చేయనుంది.

కాగా, 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగియాని ఆర్జేడీ నేతలపై సీబీఐ అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది.

Advertisement

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ముంబై, బీహార్‌, ఢిల్లీ నగరాలలో మొత్తం 25 చోట్ల ఈడీ సోదాలు చేసింది. తేజస్వీ యాదవ్ నివాసంతో పాటు ఆయన సోదరీమణులు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×