E-Paper
Advertisement

Delhi Politics: ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రేసులో కిషన్ రెడ్డి-పురందేశ్వరి పేర్లు

Delhi Politics: ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రేసులో కిషన్ రెడ్డి-పురందేశ్వరి పేర్లు
Advertisement

Delhi Politics: బీజేపీ అధ్యక్ష పీఠం ఈసారి దక్షిణాది వారికి దక్కుతుందా? తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందా? తమిళనాడుకి చెందిన నేతలు డ్రాపయ్యారా? ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడమే అందుకు కారణమా? ఇంతకీ తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో ఉన్నదెవరు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఈనెల చివర్లో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక?

Advertisement

యూపీ అధ్యక్షుడి ఎంపిక ఈనెల లేదా వచ్చే నెలలో పూర్తి కానుంది. తర్వాత బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. మళ్లీ ఏప్రిల్ లేదా మే వరకు రాష్ట్రాల ఎన్నికలు లేకపోవడంతో అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఇక్కడి నుంచి ఓ వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తోందట పార్టీ హైకమాండ్. అందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాల సమాచారం.

Advertisement

అధ్యక్షుడి రేసులో కిషన్‌రెడ్డి-పురందేశ్వరి

అందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి వేరుగా ఉంది. ఇలాంటి సమయంలో కిషన్‌రెడ్డి అధ్యక్ష పీఠంపై కూర్చొబెడితే మంచి ఫలితాలు వస్తాయన్నది ఆ పార్టీ ఆలోచన గా కొందరు నేతలు చెబుతున్నారు. ఎందుకంటే పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. అందులోనూ యువకులను ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆయన పేరును కొందరు సూచించినట్టు చెబుతున్నారు. ఈ పదవి రేసులో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ పురందేశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఇప్పటివరకు మహిళలు అధ్యక్ష పీఠంపై కూర్చున్న సందర్భాలు లేవు. రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చింది బీజేపీ. పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారట.

ALSO READ:  శబరిమలలో రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి మాంచి ఊపు వస్తుందని అంటున్నారు. ఈ రెండు పేర్లలో ఎవరో ఒకరు ఓకే కావడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైతే, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి అవకాశం రావచ్చని అంటున్నారు. ఈ సస్పెన్ష్‌కు తెరపడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×