E-Paper
Advertisement

Kedarnath Temple: కేదార్‌నాథ్ గుడిలో 125 కోట్ల గోల్డ్ స్కామ్.. పూజారి ఆరోపణలతో కలకలం..

Kedarnath Temple: కేదార్‌నాథ్ గుడిలో 125 కోట్ల గోల్డ్ స్కామ్.. పూజారి ఆరోపణలతో కలకలం..
Advertisement
KEDARNATH GOLD

Kedarnath Temple: ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌ ఆలయంలో అవినీతి కలకలం రేపుతోంది. దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపడంలో 125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు.

మహారాష్ట్రకు చెందిన ఓ దాత గర్భగుడిలో స్వర్ణ పలకల తాపడం చేయించారు. అయితే ఆలయ గర్భగుడిలో గోడలను బంగారు రేకులతో కప్పతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ కు ఉపాధ్యక్షుడిగానూ ఉన్న సంతోష్ త్రివేది ఈ కుంభకోణంలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన దిగుతామని హెచ్చరించారు.

Advertisement

బంగారు తాపడం చేయడం సంప్రదాయానికి విరుద్దమని.. ఆలయ నిర్వహణ కమిటీలోనే ఎంతోమంది దీన్ని వ్యతిరేకించారని అన్నారు. బంగారం నాణ్యతపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అయితే ఈ ఆరోపణల్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలో ఈ ప్రచారం సాగుతోందని ఆరోపించింది. బంగారు తాపడం పనులను ఆర్కియాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. పనులన్నీ దాత చేతుల మీదుగానే జరుగుతున్నాయని.. అందులో ఆలయ కమిటీకి ఎటువంటి జోక్యం లేదని స్పష్టం చేసింది. గతంలో బద్రీనాథ్‌ ఆలయానికి బంగారు తాపడాన్ని చేయించిన దాతే ప్రస్తుతం దీన్ని తయారుచేయిస్తున్నారని తెలిపింది. కేదార్‌నాథ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×