E-Paper
Advertisement

Maha Kumbh Mela: 27 ఏళ్ల తర్వాత కుంభమేళాలో భర్త ప్రత్యక్షం.. భార్య ఏం చేసిందంటే?

Maha Kumbh Mela: 27 ఏళ్ల తర్వాత కుంభమేళాలో భర్త ప్రత్యక్షం.. భార్య ఏం చేసిందంటే?
Advertisement

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో అరుదైన ఘటన జరిగింది. 27 ఏళ్లుగా ఓ మహిళ తన భర్త కోసం గాలిస్తోంది. అయితే మహా కుంభమేళాకు వచ్చిన ఆ మహిళకు భర్త ఎదురుపడ్డారు. అప్పుడు ఏం జరిగిందంటే..

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే, సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం.అందుకే దేశ, విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళాకు తరలివస్తున్నారు. అలాగే నాగ సాధువులు, అఘోరాలు రాగా.. కుంభమేళాలో భక్తితత్వం వర్ధిల్లుతోంది. అయితే ఓ మహిళ తన భర్తకు దూరమై 27 ఏళ్లుగా తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. మహా కుంభమేళాకు ఆ మహిళ రాగా, అక్కడే తన భర్తను గుర్తించింది.

Advertisement

ఝార్ఖండ్ కు చెందిన గంగాసాగర్ కు భార్య ధన్వాదేవి, ఇద్దరు సంతానం. అయితే 1998లో భార్య పిల్లలను వదిలి గంగాసాగర్ వెళ్లిపోయారు. అప్పటినుండి తన భర్త కోసం ధన్వాదేవి గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. కుంభమేళాకు ధన్వాదేవి రాగా, ఒక్కసారిగా భర్త గంగాసాగర్ ఎదురుపడ్డారు. 27 ఏళ్ల అనంతరం భర్తను చూసిన ఆమె ఆనందంతో కన్నీళ్లు నేల రాల్చింది. భర్త అఘోరాగా మారినట్లు గుర్తించిన ధన్వాదేవి, తమతో పాటు రావాలని భర్తను వేడుకుంది.

Also Read: Railway – Union Budget: 92 ఏండ్ల సాంప్రదాయానికి ఫుల్ స్టాఫ్.. రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో ఎందుకు విలీనం చేశారంటే?

Advertisement

తాను ప్రస్తుతం భక్తితత్వంలో లీనమై ఉన్నట్లు తెలిపిన గంగాసాగర్, భార్యతో పాటు వెళ్లేందుకు నిరాకరించారు. అయితే 27 ఏళ్ల తర్వాత తన భర్త జీవించి ఉన్నట్లు తెలుసుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని, భర్త కోసం తాను చూసిన ఎదురుచూపులకు ఆ భగవంతుడే దారి చూపినట్లు ధన్వా దేవి తెలిపారు. ఏది ఏమైనా 27 ఏళ్ల తర్వాత మహా కుంభమేళాలో గంగా సాగర్ ను కళ్లారా చూసే అదృష్టం దక్కిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×