E-Paper
Advertisement

Japan Smart Signals: జపాన్ సాంకేతికతతో స్మార్ట్ సిగ్నళ్లు..

Japan Smart Signals: జపాన్ సాంకేతికతతో స్మార్ట్ సిగ్నళ్లు..
Advertisement

Japanese Signal System In Bangalore: ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న టాప్ టెన్ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలోనే తొలిసారిగా జపనీస్ సాంకేతికతతో కూడిన ట్రాఫిక్ వ్యవస్థ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి టెస్టింగ్, ట్రయళ్లు ముగిశాయి.
అనుకున్నట్టు అన్నీ విజయవంతమైతే వచ్చే నెలాఖరుకే ఈ స్మార్ట్ సిగ్నళ్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. కెన్సింగ్టన్ రోడ్, మర్ఫీ రోడ్ జంక్షన్లలో ఆ వ్యవస్థ పరీక్షలు ఇటీవలే ముగిశాయి.

అడ్వాన్డ్స్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్(ATIMS) ఏర్పాటుకు జపనీస్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(JICA) నిధులు అందజేసింది. ఈ సిస్టమ్ ద్వారా జంక్షన్లలో రద్దీని బట్టి ఆటోమేటిక్‌గా సిగ్నల్స్ మారతాయి. వాస్తవానికి 2014లోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడినప్పటికీ.. ఒప్పందంపై సంతకాలు జరిగింది మాత్రం 2021లోనే. ఆ తర్వాతా పలు కారణాల వల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర జాప్యం జరిగింది.
బెంగళూరులోని 28 ప్రధాన కూడళ్లలో ఈ వ్యవస్థను నెలకొల్పినట్టు డైరెక్టరేట్ ఆఫ్ అర్బన్ అండ్ లాండ్ ట్రాన్స్ పోర్ట్(DULT) అధికారులు వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జంక్షన వద్ద వాహనాల బారు 30% మేర తగ్గుతుందని చెబుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×