E-Paper
Advertisement

BBC: బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఉద్యోగుల ఫోన్లు సీజ్

BBC: బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఉద్యోగుల ఫోన్లు సీజ్
Advertisement

BBC: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 60 నుంచి 70 మంది అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీబీసీ ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

కాగా, ఇటీవల ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే భారత ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించింది.

Advertisement

ఈ వ్యవహారంపై హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అత్యున్నత న్యాయం స్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలో బీబీసీని దేశంలో నిషేధించాలంటూ కోర్టును కోరారు. అయితే సుప్రీం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శించారు. ఈమేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×