E-Paper
Advertisement

IndiGo Airlines: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!

IndiGo Airlines: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!
Advertisement

IndiGo Airlines: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా.. ప్రయాణికులను విమానం లోపలే ఉంచడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 51) సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే.. విమానం త్వరలోనే బయలుదేరుతుందని భావించిన సిబ్బంది.. సుమారు 200 మంది ప్రయాణికులను బోర్డింగ్ పూర్తి చేసి విమానం లోపలికి పంపారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే బందీలుగా ఉండిపోయారు.

Advertisement

సాధారణంగా చెన్నై నుంచి సింగపూర్ ప్రయాణానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కానీ.. అంతకంటే ఎక్కువ సమయం విమానం కదలకుండా రన్‌వే పైనే ఉండటంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు.

విమానంలో గాలి సరిగ్గా ఆడకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించడంతో ప్రయాణికులు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమను కిందకు దించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఇండిగో ఎయిర్‌లైన్ తీరుపై మండిపడుతున్నారు. సాంకేతిక లోపం ఉంటే ప్రయాణికులను టెర్మినల్‌లో ఉంచాలి కానీ ఇలా విమానంలో నిర్బంధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌లైన్స్ కనీస మర్యాదలు పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి విలాసాలపై హరీష్ రావు సెటైర్లు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×