E-Paper
Advertisement

Indian army: మానవత్వం చాటుకున్న ఆర్మీ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గర్భిణీని..

Indian army: మానవత్వం చాటుకున్న ఆర్మీ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గర్భిణీని..
Advertisement

Indian army: దేశాన్ని ఆర్మీ జవాన్లు కంటికి రెప్పలా చూసుకుంటారు. నిరంతరం బార్డరులో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తుంటారు. అంతేకాదు.. దేశంలో ఎప్పుడు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినా లేదా దేశ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినా వెంటనే వాలిపోయి హెల్ప్ చేస్తుంటారు. ఇలా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, ఇప్పుడెందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందే.. మన జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టుడాతున్న ఓ గర్భిణీని కాపాడారు. ఈ విషయం తెలిసి ప్రజలు ఆర్మీ జవాన్లను ప్రశంసిస్తున్నారు.

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వాడా జిల్లాలో ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంట ఓ మారుమూల గ్రామం ఉంది. అయితే, ఆ గ్రామంలో ఓ గర్భిణీ ఆరోగ్యం పరిస్థితి విషమించింది. అయితే, అక్కడ ఆ గర్భిణీకి సరైన వైద్యం అందించేందుకు సరైనా ఆస్పత్రులు, వైద్యులు లేని పరిస్థితి. దీనికి తోడు అక్కడ భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. దీంతో వాటిపై ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Also Read: ‘ఏది ఏమైనా స్మృతి ఇరానీని ఓడించి తీరుతా’

దీంతో ఆ గర్భిణీని వేరే ప్రాంతానికి తీసుకెళ్లలేక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆర్మీకి చేరవేశారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న భారత జవాన్లు రంగంలోకి దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. జుమాగుండ్లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని వైద్యాధికారి ఆమెకు మొదటగా ప్రథమి చికిత్స అందించారు. అయితే, మెరుగైన వైద్యం అందించాల్సి వచ్చింది. దీంతో ఆ గర్భిణీని స్ట్రెచర్ పైకి చేర్చి.. కాలినడకన ఇతర ప్రాంతానికి సురక్షితంగా తరలించారు జవాన్లు. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి మన భారత జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×