E-Paper
Advertisement

Indian Army New Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది..

Indian Army New Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది..
Advertisement

General Upendra Dwivedi as a New Indian Army Chief: ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే స్థానంలో నియమించారు. ఈనెల 30న మనోజ్ పాండే పదవీ విరమణ చేస్తుండగా.. ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది అదే రోజు బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ శాఖ తెలిపింది. లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.

40 ఏళ్ల సర్వీస్..

Advertisement

ఉపేంద్ర ద్వివేది జులై 1 నుంచి భారత సైన్యాన్ని నడిపంచనున్నారు. 1964లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది.. 1984 డిసెంబర్ 15న భారత సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్ జమ్మూకాశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఇప్పటివరకు 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ద్వివేది.. ఆర్మీలో పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కాశ్మీర్ వ్యాలీ, రాజస్థాన్ సెక్టార్‌లో పనిచేశారు. కమాండ్ ఆఫ్ రెజిమెంట్, బ్రీగేడ్, 9 కార్ప్స్ కమాండ్, డీఐసీ అస్సాం రైఫిల్స్ నియామకాల్లో పనిచేశారు. దీంతోపాటు డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫాంట్రీ, నార్తర్న్ కబమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు.

ప్రతిష్టాత్మక మెడల్స్..

Advertisement

విద్యాభ్యాసం విషయానికొస్తే.. ద్వివేది రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, యూఎస్ ఆర్మీ వార్ కాలేజీల్లో చదివారు. ఆ తర్వాత డిఫెన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ చేశారు. అలాగే డీఎస్ఎస్సీ వెల్లింగ్టన్, మోవ్‌లో కోర్సులు చేశారు. ఈయనకు యూఎస్ ఆర్మీ వార్ కాలేజీలో ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ పొందారు. దీంతోపాటు కేంద్ర బలగాల్లో చేసిన సేవలకు గానూ ఉపేంద్ర పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం మెడల్స్ పొందారు. ద్వివేది తర్వాత అత్యంత సీనియర్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్, దక్షిణ మిలిటరీ కమాండ్ కమాండర్ ఉన్నారు.

Also Read: వీఐపీల భద్రతలో మార్పులు, ఎన్ఎస్‌జీని తప్పించి.. ఆ స్థానంలో

30 రోజుల పొడిగింపు

వాస్తవానికి జనరల్ మనోజ్ పాండే.. మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్రం పాండే పదవీ కాలాన్ని 30 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయన 2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్‌గా విధుల్లో చేరారు. అయితే ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగించడం అత్యంత అరుదు. అంతకుముందు 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ జీజీ బేవూర్ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు. కాగా, జనరల్ పాండేతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు ఈనెల చివరిలోగా పదవీ విరమణ చేయనున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×