E-Paper
Advertisement

Indian Economy: జపాన్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మ‌న‌దే!

Indian Economy: జపాన్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మ‌న‌దే!
Advertisement

Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వేదికపై జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడిపీ) విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై.. విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముఖ్యంగా 2030 నాటికి జర్మనీని కూడా వెనక్కి నెట్టి, అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని అంచనా వేసింది. దశాబ్దం చివరి నాటికి భారత జీడీపీ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రభుత్వ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్య ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వాటిని తట్టుకుని నిలబడటం విశేషం. 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు అయింది. అంతకుముందు త్రైమాసికంలో 7.8 శాతంగా ఉన్న వృద్ధి రేటు, మరింత ఊపందుకోవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గడచిన ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం మరో విశేషం.

ఈ వృద్ధి రేటుకి ప్రధాన కారణంగా దేశీయ ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడాన్ని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వినియోగ వ్యయం పెరగడం, సేవల రంగం బలపడటం, తయారీ రంగంలో ఉత్పత్తి పెరగడం వృద్ధికి దోహదం చేశాయి. ప్రభుత్వ మౌలిక వసతుల పెట్టుబడులు కూడా ఆర్థిక చక్రాన్ని వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి.

Advertisement

భారత ఎకానమీపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయడం మరో బలమైన అంశం. మూడీస్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు భారత వృద్ధి అవకాశాలపై ఆశావహంగా స్పందిస్తున్నాయి. ఫిచ్ రేటింగ్స్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాను 7.4 శాతానికి పెంచగా, ఆసియా అభివృద్ధి బ్యాంకు 2025 సంవత్సరానికి అంచనాను 7.2 శాతంగా సవరించింది. ఇది ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్‌కి ఉన్న ప్రత్యేక స్థానాన్ని చాటుతోంది.

Also Read: భారత విమానయాన చరిత్రలో మరో మైలురాయి.. ‘ధ్రువ్ ఎన్‌జీ’ నింగిలోకి!

ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుముఖం పట్టడం కూడా ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా మారాయి. ఎగుమతులు మెరుగుపడటం, వాణిజ్య రంగానికి బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు అందించడం వల్ల పరిశ్రమలు మరింత చైతన్యవంతమవుతున్నాయి. స్టార్టప్ రంగం, డిజిటల్ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలు భవిష్యత్తులో భారత్ వృద్ధికి కీలకంగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×