E-Paper
Advertisement

Independence day : ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..

Independence day :   ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..
Advertisement

Independence day : దేశవ్యాప్తంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత అందుకున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో హెలీకాప్టర్లు పూలవర్షం కురిపించాయి.  

దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు వేడుకలో పాల్గొన్నారు . 10 వేల మంది పోలీసులతో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.  భద్రత కోసం 1000 సీసీ కెమెరాలు అమర్చారు.

Advertisement

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లారు. జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వేడుకలను ప్రారంభించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×