E-Paper
Advertisement

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..
Advertisement

Delhi Air Pollution: అనుకున్నదే జరిగింది. ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పీల్చే గాలి విషపూరితంగా మారడంతో హస్తిన ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో N-95 మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. వాయు నాణ్య త కూడా సగటున 414 పాయింట్లకు చేరుకుంది. కాలుష్యం, పొగమంచుతో విజబిలిటీ పూర్తిగా తగ్గింది. మరోవైపు గాలి కాలుష్యంపై అధికార-విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గత 14రోజులు నుండి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గాలి కాలుష్యం.. ఆ ప్రాంతాలు.. ఆనంద్ విహార్ (411), బవానా (414), చాందిని చౌక్ (407), నరేలా (407), JLN స్టేడియం (401), బురారి (402), అశోక్ విహార్ (417) మరియు అయా నగర్ (402), ITO (396), అలీపూర్ (355), IGI విమానాశ్రయం (360), నజాఫ్‌గఢ్ (361) ఉన్నాయి.

Advertisement

అటు ఢిల్లీ కాలుష్యంపై.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కోర్టుల దగ్గర మంత్రదండం లేదన్నారు. శుద్ధమైన గాలి కోసం ఏం ఆదేశించాలో కూడా తెలియడం లేదంటున్నారు. గాలి నాణ్యత తగ్గిన వేళ తాను బయటికి వెళ్లడం.. వాకింగ్ కూడా చేయడం మానేసినట్లు చెప్పారు.

Also Read: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ.2 లక్షలు..?

Advertisement

ఇక సమస్యను పరిష్కరించేందుకు కోర్టులు అద్భుతాలు చేయలేవన్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఢిల్లీ కాలుష్య సమస్యకు కారణమేంటనేది అందరికీ తెలుసన్నారు. వాటికి పరిష్కారాన్ని గుర్తించాలని సూచనలు చేశారు. జనం కూడా బయటకు రావాలంటే హడలిపోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కేసు ప్రతి ఏడాది దీవాళి సమయంలో తెరపైకి వస్తుందని గుర్తు చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×