E-Paper
Advertisement

Sanjay Gandhi Nasbandi Campaign: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ ఎలా నాయకత్వం వహించారు..?

Sanjay Gandhi Nasbandi Campaign: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ  ఎలా నాయకత్వం వహించారు..?
Advertisement

Sanjay Gandhi Nasbandi Campaign: చాలా మంది భారతీయ మేధావులు దేశంలో పెరుగుతున్న జనాభా పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభా దేశ ఆర్థాకాభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. సరిగ్గా 49 ఏళ్ల క్రితం జూన్ 24-25 అర్ధరాత్రి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 21 నెలల్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భారతదేశాన్ని నియంతృత్వ పాలన కొనసాగించారని విమర్శిస్తుంటారు. ఆ సమయంలో అనేక మితిమీరిన చర్యలలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ చేత సామూహిక బలవంతంగా స్టెరిలైజేషన్ ప్రచారం జరిగిందని ప్రచారం ఉంది.

1951వ సంవత్సరంలో భారతదేశంలో సుమారు జనాభా 361 మిలియన్లు ఉందని, ఇది ప్రతీ ఏటా 5,00,000 మేర పెరుగుతుందని ఏస్ డెమోగ్రాఫర్ ఆర్ఏ గోపాలస్వామి అంచనా వేశారు. ఈ జనాభా రేటు ప్రకారం మిలియన్ల దిగుమతులు జరుగుతున్నా కూడా దేశం ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుందని అన్నారు. అయితే 1975 ఎమర్జెన్సీ యుగంలో, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పౌర స్వేచ్ఛను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సంజయ్ గాంధీ పేదరికాన్ని అంతం చేయాలనే ఉద్ధేశ్యంతో “భీకరమైన ప్రచారం” అని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో దాదాపు 6.2 మిలియన్ల పురుషులకు స్టెరిలైజేషన్ నిర్వహించారు.

Advertisement

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 1952లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో స్టెరిలైజ్ చేయించుకోవడానికి అవగాహన ప్రచారాలు, ప్రోత్సాహకాలు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇది ప్రమాదకరమైనదని భావించారు. ఈ సమయంలోనే నస్బందీ అనే పేరుతో స్టెరిలైజేషన్ ను అడ్డుకునేందుకు వేల మంది ప్రజలు నిరసనలు తెలిపారు.

Also Read: Pathankot high alert: పఠాన్‌కోట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ, పోలీసులు హై అలర్ట్

Advertisement

1972లో వర్షాలు లేకపోవడం, ఆ తర్వాత 1973లో ఆహార సంక్షోభం ఏర్పడడంతో జనాభా నియంత్రణ అనేది సవాలుగా మారింది. ఆ సమయంలో సంజయ్ గాంధీకి ఎటువంటి అధికారిక పదవి లేకపోయినా కూడా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. ఏది ఏమైనప్పటికీ, 1977లో ఇందిరాగాంధీ ఓటమిలో నస్బందీ ప్రచారం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో, కాంగ్రెస్ ఓట్ షేర్ బాగా పడిపోయింది. దీనికి విరుద్ధంగా, దక్షిణాది రాష్ట్రాలలో మెరుగ్గా పనిచేసింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×