E-Paper
Advertisement

Israel Failure: నిఘా కన్నుగప్పి..

Israel Failure: నిఘా కన్నుగప్పి..
Advertisement

Israel Failure: ఇజ్రాయెల్ కలలోనైనా ఊహించని దెబ్బ.. పకడ్బందీగా.. ఎంతో సమన్వయంతో జరిగిన దాడి. నిజమే. ఇది ఎలా సాధ్యమైంది? గాజా‌స్ట్రిప్‌, ఇజ్రాయె‌ల్‌ను వేరు చేసే కోటగోడ లాంటి కంచెను సైతం ధ్వంసం చేసి డజన్ల కొద్దీ పాలస్తీనియన్ సాయుధులు తమ భూభాగంలోకి ప్రవేశించేంత వరకు నెతన్యాహు సర్కారు నిద్రమత్తు వీడకపోవడం విస్మయం గొలుపుతోంది.

1973 యామ్ కిప్పూర్ యుద్ధం 50వ వార్షికోత్సవం మరుసటి రోజే 5 వేల రాకెట్లతో హమస్ విరుచుకుపడటం ఓ రకంగా ఇజ్రాయెల్‌కు కోలుకోలేని దెబ్బే. భద్రత, నిఘాపరంగా ఇంత ఘోర వైఫల్యం చోటుచేసుకోవడం ఈ తరంలో బహుశా ఇదే. ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్, నిఘా సంస్థ మొస్సాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు.. ఇవేవీ దాడి ముప్పును ఊహించలేకపోయాయి.

Advertisement

హమస్ దాడి ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అంతు పట్టడం లేదని ఇజ్రాయెల్ అధికారులు వాపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శత్రువుల కదలికలను పసిగట్టడంలో పశ్చిమాసియాలోనే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఎంతో పేరుంది. పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులతో పాటు లెబనాన్, సిరియా.. అన్ని చోట్లా మొస్సాద్‌‌కు ఇన్ఫార్మర్లు, ఏజెంట్లు ఉన్నారు. వారి సాయంతోనే గతంలో ఎందరో మిలిటెంట్ నేతలను అంతమొందించగలిగారు.

ఇందుకోసం డ్రోన్ దాడులు జరిపిన సందర్భాలున్నాయి. ఏజెంట్ల స్థానంలో జీపీఎస్ ట్రాకర్ వంటి పరిజ్ఞానాన్ని వినియోగించారు. మొబైల్ ఫోన్లు పేలిపోయాలా చేసి తద్వారా శత్రుశేషం లేకుండా చూసిన ఉదంతాలు సరేసరి. సరిహద్దు కంచె వద్ద కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సర్లు వంటి అత్యాధునిక పరికరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. అయినా హమస్ మిలిటెంట్లు వీటన్నింటినీ బుల్ డోజ్ చేసి మరీ.. ఇజ్రాయెల్ పట్టణాల్లోకి చొచ్చుకు రాగలిగారు.

Advertisement

పారాగ్లైడర్ల సాయంతో కంచె మీదుగా ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలైంది. మోటారైజ్డ్ హాంగ్ గ్లైడర్ సాయంతో ఓ మిలిటెంట్ చొరబడుతున్న తీరును ఆ వీడియో వివరిస్తోంది. ఇది నిఘా వైఫల్యమే అని ఇజ్రాయెలీలు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం ముందున్న తక్షణ కర్తవ్యం.. దక్షిణ దిశ నుంచి దేశంలోకి చొరబడిన హమస్ మిలిటెంట్లను ఏరివేయడం.

కంచె సమీపంలోని పలు పట్టణాలు ఇప్పటికే మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బేరి, ఓఫాకిమ్ ప్రాంతాల్లో పౌరులను బందీలుగా తీసుకున్నట్టు సమాచారం.కొందరు సైనికాధికారులు కూడా వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. మిలిటెంట్లు, చొరబాటుదారులను ఏరివేస్తూనే.. ఆ ప్రాంతాలను విముక్తం చేయడమే ఇజ్రాయెల్ సైన్యం ప్రథమ ప్రాధాన్యం.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×