E-Paper
Advertisement

Heatwave: ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. వడదెబ్బకు ఏడుగురు మృతి

Heatwave: ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. వడదెబ్బకు ఏడుగురు మృతి
Advertisement

Delhi Heatwave: ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో బుధవారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలుల తీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో ఏడుగురు మృతి చెందగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటగా ఎండ వేడిని తట్టుకోలేక ఢిల్లీ వాసులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మే 27 నుంచి జూన్ 19 వరకు సుమారు 45 మంది రామ్ మనోహర్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజుల్లోనే 22 మంది అడ్మిట్ కాగా వడ దెబ్బ వల్ల ఏడుగురు మృతి చెందినట్లు ఆసుప్రతి సూపరింటెండెంట్ అజయ్ శుక్లా తెలిపారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో కూలీలుగా పనిచేసే వారే ఎక్కువగా ఆసుప్రతిలో చేరుతున్నట్లు వెల్లడించారు. వడదెబ్బకు గురైన వారు ఆలస్యంగా ఆసుపత్రిలో చేరుతుండటం మరణాలకు కారణమని తెలిపారు.

Advertisement

Also Read: నీట్ వివాదంపై కాంగ్రెస్ ఆగ్రహం.. జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు

ఉత్తరాదిలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎండల వల్ల హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వడదెబ్బ ప్రభావిత రోగులకు ప్రాధాన్యత ఇచ్చి చికిత్స అందిచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా సూచనలు జారీ చేసింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×