E-Paper
Advertisement

Heatwave Over in India: గుడ్ న్యూస్.. ఇక వడగాలుల్లేవ్.. ఈ రాష్ట్రాలకు వర్షసూచన: ఐఎండీ!

Heatwave Over in India: గుడ్ న్యూస్.. ఇక వడగాలుల్లేవ్.. ఈ రాష్ట్రాలకు వర్షసూచన: ఐఎండీ!
Advertisement

Heatwave is Almost Over in India: మండువేసవి నుంచి దేశప్రజలకు ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2 రాష్ట్రాల్లో మినహా.. దేశమంతా హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. బంగాళాఖాతం నుంచి తేమ పెరగడంతో.. ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడతాయని అంచనా వేసింది. వడగాలుల కాలం దాదాపు ముగిసినట్లేనని, ఇక కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.

శుక్రవారం పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశమంతా వేడిగాలులు తగ్గుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. హీట్ వేవ్ తగ్గినప్పటికీ.. వర్షాలు అధికంగా ఉంటాయో లేదో అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవవచ్చని తెలిపారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు.. అస్సాం, మేఘాలయ సమీప రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పారు.

Advertisement

మరోవైపు నేటి నుంచి చార్ ధామ్ యాత్ర మొదలైంది. ఉదయం 7.10 గంటలకు జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం.. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయం తలపులు తెరచుకోగానే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసింది.

Also Read: ఎండలల్లో ఇదే రికార్డు.. దేశంలో ఎన్నడూ లేనంతగా భారీగా..

Advertisement

మరోవైపు తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×