E-Paper
Advertisement

Haryana BJP Gets Poll Body Notice : బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..

Haryana BJP Gets Poll Body Notice : బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..
Advertisement

Haryana BJP Gets Poll Body Notice For Featuring Child In Campaign Video: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో ఇప్పటికే అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఢిల్లీ బీజేపీ ఎంపీలు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వాల్మీకులు, గుర్జర్లు, జాట్ కులస్తుల ఓట్లు ఎక్కువ. అందుకే వారిని బీజేపీ వైపు తిప్పుకునేలా బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. అయితే హర్యానా ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టింది. అన్ని పార్టీలకన్నా ముందుగానే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే హర్యానాలో బీజేపీకి అక్కడి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అక్కడి బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసు పంపింది.

మైనర్ బాలుడితో ప్రచారమా?

Advertisement

బీజేపీ లాంటి జాతీయ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మైనర్ బాలుడిని ఉపయోగించుకోవడం హర్యానా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హర్యానా బీజేపీ తీరును తప్పుపడుతూ అక్కడి నేతలకు బుధవారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించుకోవడం తప్పని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేటి సాయంత్రం ఆరు గంలలలోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల నిర్వహణ అధికారి హర్యానా బీజేపీ నేతలను ఆదేశించారు.

హట్ టాపిక్
హర్యానా రాజకీయాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయినా ఇంకెవరూ దొరకనట్లు చిన్నారులను ఎన్నికల ప్రచారంలో చీఫ్ గా ఉపయోగించుకోవడమేమిటని ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ అగ్రనాయకత్వం కూడా హర్యానా బీజేపీ నేతలపై సీరియస్ గా ఉంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఇలాంటి పనుల వలన పార్టీ ప్రతిష్టకు అప్రదిష్ట తెచ్చినవారవుతారని హర్యానా నేతలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉంది.

Advertisement

https://twitter.com/BJP4Haryana/status/1828379342080229768

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×