E-Paper
Advertisement

Delhi AIIMS: ఎయిమ్స్‌ పై సైబర్ అటాక్.. 200 కోట్లు డిమాండ్.. మనోళ్ల యాక్షన్ షురూ..

Delhi AIIMS: ఎయిమ్స్‌ పై సైబర్ అటాక్.. 200 కోట్లు డిమాండ్.. మనోళ్ల యాక్షన్ షురూ..
Advertisement

Delhi AIIMS: ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద హ్యాకింగ్ ఇది. సైబర్ నేరగాళ్లు ఇండియాపై పంజా విసిరారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేశారు. ఇది జరిగి వారం అవుతోంది. ఇంత వరకూ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. అంతలోనే హ్యాకర్ల నుంచి మెసేజ్ వచ్చింది. 200 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కి దిగారు. అదికూడా క్రిప్టో కరెన్సీలోనే చెల్లించాలంటూ కండిషన్ కూడా పెట్టడం కలకలం రేపుతోంది.

వారం రోజులుగా హాస్పిటల్ లో సర్వర్లు పని చేయడం లేదు. సుమారు 3-4 కోట్ల మంది రోగుల సమాచారం అందులో ఉంది. వారిలో మాజీ ప్రధానులు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు, పలువురు వీఐపీలకు సంబంధించి ఆరోగ్య సమాచారం కూడా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

హ్యాకర్ల దాడిపై ఇండియా కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-IN), ఢిల్లీ పోలీసులు, హోంమంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ, సైబర్‌ ఉగ్రవాదం అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇ-హాస్పిటల్‌ డేటా బేస్‌ను పునరుద్ధరించారు. ఎయిమ్స్‌ నెట్‌వర్క్‌ను పూర్తిగా యాంటీ వైరస్‌ ద్వారా స్కాన్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. ఆస్పత్రిలోని కంప్యూటర్లు అన్నింటికీ ఇంటర్నెట్‌ కట్ చేశారు.

Advertisement

మరోవైపు, సర్వర్లు నిలిచిపోవడంతో వారం రోజులుగా ఆస్పత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్‌గానే జరుగుతోంది.
ఎమర్జెన్సీ, ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషెంట్‌, లేబోరేటరీ లాంటి సేవలన్నీ మాన్యువల్‌గానే నిర్వహిస్తున్నారు.

మరి, హ్యాకర్లు డిమాండ్ చేసినట్టు డబ్బులు చెల్లిస్తారా? లేదంటే, మనోళ్లే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా? చూడాలి..

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×