E-Paper
Advertisement

Parliament Attack : లోక్ సభ ఘటనలో నలుగురు అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు..

Parliament Attack : లోక్ సభ ఘటనలో నలుగురు అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు..
Advertisement

Parliament Attack : దేశాన్ని మొత్తం షేక్ చేసిన పార్లమెంట్‌ అలజడిపై దర్యాప్తు ప్రారంభమైంది. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ లోపల, వెలుపల ఆందోళన చేసిన ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్‌ లోపల ఇద్దరు యువకులను, పార్లమెంట్‌ వెలుపల ఓ యువకుడు, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇప్పుడు వీరందరిని వేరువేరుగా విచారిస్తున్నారు పోలీసులు.

పార్లమెంట్‌ వెలుపల ఆందోళన చేసిన మహిళను హర్యాణా హీస్సార్ కు చెందిన నీలమ్‌గా, యువకుడిని మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు. లోపల ఆందోళన నిర్వహించిన ఇద్దరు యువకులను కూడా గుర్తించారు. సాగర్ శర్మ, దేవరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ అలజడికి కారణమన్నారు పోలీసులు. వీరిద్దరు మైసూర్ కు చెందని వారిగా గుర్తించారు. అసలు వారు ఎందుకు అలజడి సృష్టించారన్న దానిపైనే మొదట ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కూడా దర్యాప్తు నిర్వహించాలని స్పీకర్‌ ఓం బిర్లా దర్యాప్తుకు ఆదేశించారు. స్మోక్‌ బాంబ్‌లు అసలు పార్లమెంట్‌ లోపలికి ఎలా తీసుకొచ్చారన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×