E-Paper
Advertisement

Fog Effect : పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!

Fog Effect : పొగమంచు.. ప్రజలను ఊహించని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ పొగ మంచు కారణంగా ఒక వైపు రోడ్డు ప్రమాదాల్లో పలువురు అసువులు భాస్తుంటే.. మరి కొందరు తేవేర గాయాలతో బయపటపడుతున్నారు. ఇక నెలపైనే ఈ పరిస్థితి ఉంటే నింగిలో సైతం మరింత అలజడి చేస్తుంది పొగ మంచు. ఇప్పటికే ఈ పొగ మంచు వల్ల విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Fog Effect : పొగమంచు  ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!
Advertisement

Fog Effect : పొగమంచు.. ప్రజలను ఊహించని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ పొగ మంచు కారణంగా ఒక వైపు రోడ్డు ప్రమాదాల్లో పలువురు అసువులు భాస్తుంటే.. మరి కొందరు తేవేర గాయాలతో బయపటపడుతున్నారు. ఇక నెలపైనే ఈ పరిస్థితి ఉంటే నింగిలో సైతం మరింత అలజడి చేస్తుంది పొగ మంచు. ఇప్పటికే ఈ పొగ మంచు వల్ల విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పొగ మంచు కారణంగా జీరో విజిబులిటీతో విమానాలు దిగడానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే 168 విమానాలు ఆలస్యంగా నడవగా.. దాదాపు 100 విమానాలను రద్దు చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. పలు విమానాశ్రయాల్లో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో సైతం విమానాశ్రయాలల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వేచి ఉండేందుకు స్థలం, ఆహారం వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదంటూ.. ప్రయాణికులు, పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీలో అయితే ఏకంగా విమానం ఆలస్యమైనందుకు ఓ వ్యక్తి పైలట్‌పైనే దాడి చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ఈ క్రమంలోనే పౌర విమానయానశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రతికూల వాతావరణం కారణంగా 3 గంటలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని డీజీసీఏ తెలిపింది. విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేకుండా ఆలస్యమయ్యే సందర్భాల్లో ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థ పూర్తి రక్షణ, సదుపాయాలు కల్పించాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను విమానయాన సంస్థలన్నీ తక్షణమే పాటించాలని ఆదేశించింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం.. విమాన ఆలస్యానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని సదరు విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో వెల్లడించాలని పేర్కొంది. ముందస్తు సమాచారాన్ని ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్‌ లేదా ట్సప్‌, ఈ-మెయిల్‌ రూపంలో తెలియజేయాలని సూచించింది. ఆలస్యానికి సంబంధించి వాస్తవిక సమాచారాన్ని విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులకు తెలపాలని చెప్పింది. ప్రయాణికులతో సంప్రదింపులు జరిపేందుకు, నిరంతరం మార్గనిర్దేశం చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

Advertisement

అలానే దేశంలో 6 మెట్రో విమానాశ్రయాల్లో వార్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి సింధియా వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల్లో జరిగే సంఘటలను రోజూ 3 సార్లు కేంద్రానికి నివేదించాలని ఆదేశించారు. ప్రయాణికుల అసౌకర్యానికి సంబంధించిన సమస్యల తక్షణ పరిష్కారానికి.. ఈ 6 చోట్ల ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లు.. వార్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. విమానాశ్రయాల్లో నిరంతరం తగినంత మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×