E-Paper
Advertisement

Airlines News: విమానం ఆలస్యం.. 35 మంది ప్యాసింజర్లు మిస్.. అసలేం జరిగిందంటే..

Airlines News:  విమానం ఆలస్యం.. 35 మంది ప్యాసింజర్లు మిస్.. అసలేం జరిగిందంటే..
Advertisement
Chennai airport latest news

Chennai airport latest news(Today news paper telugu): చెన్నై విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం 35 మంది పాసింజర్స్ ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసింది. బాధిత ప్రయాణికులు ఎయిర్ పోర్టులో నిరసనకు దిగారు. 7 గంటల 45 నిమిషాలకు ఎయిర్ అరేబియా ప్యాసింజర్ విమానంలో చెన్నై నుంచి అబుదాబికి 182 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం అబుదాబి నుంచి చెన్నైకి 7 గంటలకు రావాలి. కానీ వర్షం కారణంగా బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Advertisement

అయితే, ప్యాసింజర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫ్లైట్ ఆలస్యం అవుతోందని అని మాత్రమే మెసెజ్ చేశారు. దీంతో.. విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు ఫ్లైట్ కోసం ఎదురు చూశారు. 182 మంది ప్రయాణికుల్లో 35 మంది ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. చాలా సమయం ఎదురు చూసిన ఈ 35 మంది.. ఎయిర్ పోర్టు సిబ్బందిని అడగ్గా 12 గంటల 18 నిమిషాలకే విమానం వెళ్లి పోయిందని చెప్పారు. గంట క్రితం విమానం బయలు దేరితే ఇంత వరకు ఏం చేస్తున్నారని తిరిగి ప్రశ్నించారు. బుకింగ్ క్యాన్సిల్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మంది ప్రయాణికులు లేకుండా.. వారికి సమాచారం కూడా ఇవ్వకుండా విమానం ఎలా బయలుదేరుతుందని మండిపడ్డారు. 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం 12 గంటల 18 నిమిషాలకు బయలు దేరితే ప్రయాణికులను అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. 35 మంది ఎయిర్ పోర్టులో ఆందోళన చేపట్టారు. ఎయిర్‌పోర్టు వదిలి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారికి, చెన్నై విమానాశ్రయ అధికారులకు, చెన్నై విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×