E-Paper
Advertisement

Taj Express: రైలులో అగ్ని ప్రమాదం.. నాలుగు బోగీల్లో ఎగిసిపడుతున్న మంటలు

Taj Express: రైలులో అగ్ని ప్రమాదం.. నాలుగు బోగీల్లో ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Taj Express Train Fire: ఢిల్లీ తాజ్ ఎక్స్ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్లాబాద్ నుంచి ఓక్లా వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నాలుగు బోగీల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీలోని సరిత విహారం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 4.24 గంటలకు తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని, 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×