E-Paper
Advertisement

Two killed in Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Two killed in Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Advertisement

Two killed in Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతంలో గల ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. తలనగరి ప్రాంతంలో.. ఇనుమును కరిగించే కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవ్వగా.. డజన్ మందికి పైగా వర్కర్లు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫ్యాక్టరీలో అమర్చి ఉన్న ఫర్నేస్ లో ఇనుమును కరిగిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

పేలుడు ఘటన తర్వాత.. కంపెనీ నుంచి మంటలు భారీగా ఎగసి పడటంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇనుమును కరిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు మృతుల్లో ఒకరి బంధువులు తెలిపారు. ఇనుము లావా కొందరు యువకులపై పడటంతో.. వారు కూడా గాపడ్డారు.

Advertisement

ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ నిర్వాహకులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ కు సమాచారమివ్వగా.. రెస్క్యూ టీమ్ ఫ్యాక్టరీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×