E-Paper
Advertisement

Fake Toll Plaza : నకిలీ టోల్ ప్లాజాతో కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు.. అయిదుగురు అరెస్ట్

Fake Toll Plaza : రహదారిపై దొంగతనంగా టోల్ ప్లాజా నిర్మించి ఆ దారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి చలానాల పేరుతో కొందరు మోసగాళ్ల కోట్ల రూపాయలు దోచుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలో జరిగింది.

Fake Toll Plaza : నకిలీ టోల్ ప్లాజాతో కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు.. అయిదుగురు అరెస్ట్
Advertisement

Fake Toll Plaza : రహదారిపై దొంగతనంగా టోల్ ప్లాజా నిర్మించి ఆ దారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి చలానాల పేరుతో కొందరు మోసగాళ్ల కోట్ల రూపాయలు దోచుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలో జరిగింది.

నకిలీ టోల్ ప్లాజా కట్టి దాదాపు ఏడాదిన్నర పాటు టోల్ ఫీజు పేరులతో ఓ ముఠా వాహనదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. గుజరాత్ రాష్ట్రం మోర్బీ, కచ్ జిల్లాల మధ్య నేషనల్ హైవే 8ఏపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. ఆ దారిలో వెళ్లితే చలాన్ కట్టవలసి వస్తోందని.. చాలా వాహనదారులు పక్కనే మరో దారి నుంచి వెళ్లడం ప్రారంభించారు. ఇది గమనించింన కొందరు మోసగాళ్లు.. ఒక ప్లాన్ వేశారు. ఆ పక్కన ఉన్న ప్రత్యామ్నాయ దారిలో కొంత డబ్బు ఖర్చు చేసి బైపాస్ రోడ్డులా కనిపించే రోడ్డు నిర్మించారు. అక్కడ సమీపంలోనే నిరుపయోగంగా ఉన్నా ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో నకిలీ టోల్ ఆఫీసు పెట్టారు. రోడ్డుపై ఒక నకిలీ టోల్ ప్లాజా నిర్మించారు.

Advertisement

ఆ దారిలో వస్తున్న వాహనదారులతో చాలా తక్కువ టోల్ ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టారు. లారీల కోసం రూ.20 నుంచి రూ.200 దాకా చలాన్ తీసుకునేవారు. సాధారణంగా టోల్ ప్లాజాలో ఒక లారీకి రూ.110 నుంచి రూ.595 చలాన్ తీసుకుంటారు. ఇటీవలే పోలీసులకు ఈ విషయం తెలిసింది.

పోలీసులు విచారణ చేసి.. అయిదు మందిని అరెస్టు చేశారు. అయిదు మందిలో ఒకరు రిటైర్డ్ సైనికుడని సమాచారం. పట్టుబడిన వారంతా గుజరాత్‌లోని వాంకనేర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

Advertisement

కొన్ని నెలల క్రితమే గుజరాత్‌లో దాహోద్ జిల్లాలో ఆరు నకిలీ ప్రభుత్వ ఆఫీసులను పోలీసులు సీజ్ చేశారు. ఆ ఆఫీసుల నుంచి రూ.8 కోట్ల పట్టుబడ్డాయి. ఈ ఆఫీసులను ఒక రిటైర్డ్ IAS అధికారి నడుపుతున్నారని తెలిసి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×