E-Paper
Advertisement

Himachal Cloudburst: ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క మా ఇళ్లు తప్ప.. నాకు కన్నీళ్లు ఆగడంలేదు

Himachal Cloudburst: ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క మా ఇళ్లు తప్ప.. నాకు కన్నీళ్లు ఆగడంలేదు
Advertisement

Himachal Cloudburst: హిమాచల్ ప్రదేశ్ లో వరదలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల కారణంగా శిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ గ్రామంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి అనితాదేవీ అనే ఆ గ్రామవాసి జాతీయ మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా తమ ఇల్లు తప్ప ఊరంతా కొట్టుకుపోయిందంటూ ఆమె తన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘వరదలు మా ఊరిని ముంచెత్తినప్పుడు మేమంతా నిద్రలో ఉన్నాం. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో మా ఇల్లు దద్దరిల్లింది. వెంటనే లేచి ఏం జరిగిందో చూసేందుకు బయటకు వచ్చాం. తరువాత చూస్తే అంతా నీరే కనిపిస్తుంది తప్ప ఇంకేమీ కనిపించడంలేదు. ఊరు మొత్తం కొట్టుకుపోయింది. ఇది చూసి మేం తీవ్రంగా వణికిపోయాం. వెంటనే మేమంతా భగవతి కాళీమాతా ఆలయం వద్దకు చేరుకుని తల దాచుకున్నాం. ఈ వినాశనంలో మా ఇల్లు ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది. నా కళ్ల ముందే అంతా కొట్టుకుపోయింది. దీంతో నేను తీవ్రంగా వణికిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలో.. ఎవరితో ఉండాలో తెలియడంలేదు’ అంటూ ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యింది.

Advertisement

Also Read: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

ఇదే గ్రామానికి చెందిన మరో బాధితురాలు బఖ్షి రామ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘నా కుటుంబంలోని 14 మంది వరదల్లో కొట్టుకుపోయారు. అయితే, వరదలు వచ్చిన విషయం తెల్లవారుజామున నాకు తెలిసింది. ఆరోజు నేను రాంపూర్ లో ఉండడంతో ప్రాణాలతో ఉన్నాను. విషయం తెలిసిన వెంటనే వచ్చి చూస్తే ఏమీ మిగలలేదు’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో తన వాళ్లు ఎవరైనా సజీవంగా ఉంటారేమోనని, ఆమె వెతుకుతున్న తీరును చూసి అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

అయితే, గల్లంతైన వారికోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లతో సైతం ఉపయోగిస్తూ వారి జాడను కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, 50 మందికి పైగా గ్రామస్తుల ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ఉన్నతాధికారి మాట్లాడుతూ.. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని చెప్పారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×