E-Paper
Advertisement

8th time ED notice to Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. ఎనిమిదోసారి!

8th time ED notice to Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. ఎనిమిదోసారి!
Advertisement

Arvind Kejriwal

ED Notices to Delhi Cm Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎనిమిదోసారి సమన్లు ఇచ్చింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ కోరింది.

Advertisement

ఢిల్లీ మద్య పాలసీ కేసులో గతంలో ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన సమయంలో  కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. దీంతో మరోసారి ఈడీ.. ఢిల్లీ సీఎంకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటుసులపై అరవింద్ కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈసారైనా విచారణకు హాజరవుతారా లేదా అనేద ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌ వ్యవహారంపై విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏడోసారి నోటీసులు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ఈక్రమంలోనే మంగళవార 8వ సారి ఈడీ నోటీసులు ఇచ్చింది.

Advertisement

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు నవంబర్‌ 2న ఈడీ తొలిసారిగా నోటీసులు ఇచ్చింది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణకు హాజరుకాలేదు. అప్పటి నుంచి క్రమతప్పకుండా ఒక నోటీసు గుడువు ముగియగానే మరోసారి సమన్లు ఇస్తోంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసు న్యాయస్థానంలో నడుస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. ఈ సమయంలో ఈడీ తనకు నోటీసులు పంపడంపై అభ్యంతర తెలుపుతున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు.

నోటీసులు ఇచ్చినా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంపై ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఆయన ‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఈ విచారణకు హాజరయ్యారు. కేజ్రీవాల్ విజ్ఞప్తితో విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×