E-Paper
Advertisement

Raj Kundra’s Bitcoin Scam Case: బిట్ కాయిన్ ఇష్యూ.. బుక్కైన శిల్పాశెట్టి దంపతులు.. 97 కోట్ల ఆ స్తుల సీజ్!

Raj Kundra’s Bitcoin Scam Case: బిట్ కాయిన్ ఇష్యూ.. బుక్కైన శిల్పాశెట్టి దంపతులు.. 97 కోట్ల ఆ స్తుల సీజ్!
Advertisement

ED Attaches Rs 97 Crores of Raj kundra – Shilpa shetty’s Property in Bitcoin Scam Case: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి కష్టాలు తప్పడం లేదు. బిట్ కాయిన్ పోంజీ కేసు ఈ దంపతులను వెంటాడుతోంది. ఏడేళ్లుగా ఈ కేసు సాగుతూ వస్తోంది. ఇందులోభాగంగా శిల్పా దంపతులకు చెందిన దాదాపు 98 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ముంబైలో జుహూ ఏరియాలో ప్లాట్‌, పూణెలోని ఓ బంగ్లా సహా మొత్తం 98 కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చింది ఈడీ.

ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో బిట్ కాయిన్ పోంజీ స్కీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పెట్టుబడిపెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయన్నది అందులోని లోగుట్టు. దీని ద్వారా మల్టీలెవన్ మార్కెటింగ్ పద్దతిలో అమాయకుల నుంచి దాదాపు 6 వేల 600 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు శిల్పాశెట్టి దంపతులు. మొదట్లో లాభాలు వచ్చినట్టు చూపించారు. చివరకు అసలు మోసం బయటపడింది. సంస్థ ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ED attaches Raj Kundra and Shilpa Shetty property worth Rs 97 crores on Bitcoin scam
ED attaches Raj Kundra and Shilpa Shetty property worth Rs 97 crores on Bitcoin scam
Advertisement

Also Read: Mahua Moitra: మరో వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. మరీ ఇంత దారుణమా..!

ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి మాస్టర్ మైండ్  అమిత్ భరద్వాజ్ నుంచి శిల్పా భర్త రాజ్‌కుంద్రా 285 బిట్ కాయిన్స్ తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. అంతేకాదు ఉక్రెయిన్‌‌లో ఓ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్టు ప్రస్తావించింది. ప్రస్తుత ఆయన వద్దనున్న బిట్ కాయిన్స్ విలువ మార్కెట్ ప్రకారం 150 కోట్ల రూపాయలుగా పేర్కొంది. ఈ క్రమంలో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.

Advertisement

ఈ కేసు మాత్రమే కాదు శిల్ప భర్త రాజ్‌కుంద్రాపై మరో కేసు ఉంది. సినిమాల పేరిట యువతులను బలవంతం చేసి అశ్లీల వీడియోలు షూట్ చేయించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్దిరోజులపాటు జైలులో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కుంద్రా తన పేరిట ఉన్న ఆస్తులను తన వైఫ్ శిల్పాశెట్టి పేరు మీదగా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×