E-Paper
Advertisement

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట
Advertisement

Relief to DK Shivakumar High Court rejects: కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహరంపై డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్ దాఖలు అయ్యాయి.

రెండు పిటిషన్లలో ఒకటి సీబీఐ దాఖలు చేయగా..మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేశారు. అయితే, తాజాగా, వీటిని పరిశీలించిన ధర్మాసనం విచారణను కొనసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో డిప్యూటీ సీఎంకు కోర్టులో ఊరట లభించినట్లయింది.

Advertisement

హైకోర్టు తీర్పు అనంతరం డీకే శివకుమార్ స్పందించారు. అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తున్నానని, నేను కోర్టు తీర్పు, దేవుడిని నమ్ముతానన్నారు.

ఇదిలా ఉండగా, 2013-18 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన సంపాదనలో రూ.74కోట్లు లెక్కకు మంచిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి.

Advertisement

ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా సీబీఐ ఆయనపై 2020లో కేసు నమోదు చేసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×