E-Paper
Advertisement

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మే 1 నుంచి అసలైన హంగామా!

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మే 1 నుంచి అసలైన హంగామా!
Advertisement

Delhi TTD: ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ విశేష ఆధ్యాత్మిక వేడుకల గురించి ఢిల్లీ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి వివరాలను వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం, వేడుకల విజయవంతం కోసం ఆలయ కమిటీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్య అతిథులు ,ఆహ్వానాలు

Advertisement

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడమే తమ లక్ష్యమని సుమంత్ రెడ్డి పేర్కొన్నారు.

భక్తుల సౌకర్యాలు – భద్రత

Advertisement

ఢిల్లీ నుంచే కాకుండా ఉత్తర భారతదేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తుతో పాటు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా అత్యవసర సేవల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభంగా అయ్యేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. దర్శనం అనంతరం అందరికీ ప్రసాదం అందేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.

బ్రహ్మోత్సవాల తేదీలు

ఈ ఆధ్యాత్మిక వేడుకలు ఈ నెల 30వ తేదీన అంకురార్పణతో ప్రారంభమై, వరుసగా పది రోజుల పాటు కొనసాగుతాయి.మే 1వ తేదీన ధ్వజారోహణంతో ప్రధాన ఉత్సవాలు మొదలవుతాయి. మే 5న స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ, విశేషమైన కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. మే 10న పుష్పయాగంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

సాంస్కృతిక ప్రదర్శనలు , విశేషాలు

తిరుమల నుండి ప్రత్యేకంగా వచ్చే కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు, సాంప్రదాయ గానాలతో భక్తులను అలరించనున్నారు. మరో విశేషమేమిటంటే, స్వామివారి భక్తురాలు జయశ్రీ రూపొందించిన భగవద్గీతను ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు సైతం అర్థమయ్యేంత సులభ శైలిలో ఆమె దీనిని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. భక్తులందరూ ఈ సేవలను తిలకించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ కోరుతోంది.

Also Read: మృగాల కంటే ఘోరం.. ప్రాణం తీస్తున్న ‘బ్లడ్’ మాఫియా గుట్టురట్టు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×