E-Paper
Advertisement

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు ధ్వంసం.. 8 మంది మృతి

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు ధ్వంసం.. 8 మంది  మృతి
Advertisement

Delhi Blast:ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ పేలుడు ధాటికి ఆ కారు పూర్తిగా దగ్ధమైంది. అంతేకాకుండా, మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో పార్క్ చేసి ఉన్న  వాహనాలకు కూడా మంటలు అంటుకుని దెబ్బతిన్నట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను పెంచింది.

సోమవారం ఉదయమే ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేయగా, ఢిల్లీ శివారులో ఏడుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయినప్పటికీ పేలుడు సంభవించడంపై ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×