E-Paper
Advertisement

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!
Advertisement

Delhi Protest: దేశ రాజధాని దిల్లీ మరోసారి రణరంగంగా మారింది. ఒకవైపు తమ భవిష్యత్తు కోసం గళమెత్తిన విద్యార్థులు, మరోవైపు తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులు ఒకేసారి రోడ్డెక్కడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికారుల హెచ్చరికలను పక్కనపెట్టి వేలాది మంది యువత సోమవారం పార్లమెంటు దిశగా దూసుకెళ్లడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి పెద్ద ఎత్తున వీడియోలు మంగళవారం వైరల్ గా మారాయి.

కాక్రోజ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఛలో పార్లమెంటు మార్చ్ కు వేలాదిగా యువకులు తరలిరావడంతో దిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో యువత, పోలీసుల మధ్య ఘర్షణలో చోటుచేసుకున్నాయి. ఓ యువకడు పోలీసులపైకి పెప్పర్ స్ప్రే కొట్టి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు కేంద్రానికి అనుకూలమైన మీడియా అని ఆరోపిస్తూ ఓ రిపోర్టర్ పట్ల నిరసనకారులు అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

Advertisement

మరోవైపు నిరసనకారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను ఓ యువతి కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మేము మీ పిల్లలాంటి వాళ్లమే కదా. మేమేం టెర్రరిస్టులం కాదు కదా’ అంటూ చేతులు జోడించి ఓ మహిళా పోలీసు అధికారిణిని యువతి ప్రశ్నించింది. అటు ఇంకో యువతి పోలీసులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. ‘మీరు ఖాకీలు కాదు.. బీజేపీ గుండాలు’ అంటూ ఓ పోలీసు అధికారి కాలర్ పట్టుకొని నిలదీసే ప్రయత్నం చేసింది.

Advertisement

మరోవైపు విపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష కాంగ్రెస్ సైతం మంగళవారం దిల్లీలో రోడ్డెక్కింది. నిరసనకారులపై జరిగిన లాఠీఛార్జ్ ను ఖండిస్తూ ప్రధాని మోదీ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. రాహుల్ గాంధీ తో పాటు ప్రియాంకా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ అగ్రనేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

సీజేపీ, కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్న క్రమంలోనే అటు రైతులు సైతం దిల్లీలోకి నిరసనలకు పిలుపునిచ్చారు. ఇవాళ మహాపంచాయత్ లో పాల్గొనేందుకు దిల్లీకి వస్తున్న పంజాబ్, హర్యానా రైతులను శంభు బార్డర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఈ నిరసనకు దిగారు. ప్రస్తుతం దిల్లీ బోర్డర్ లోనే వారు ఉన్నారు. దీంతో పరిస్థితులు ఏ విధంగా మారతాయన్న ఆందోళనలు మెుదలయ్యాయి.

Also Read: భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×