E-Paper
Advertisement

Delhi : వరద ముంపులోనే ఢిల్లీ.. తగ్గని యమునా ఉద్ధృతి..

Delhi : వరద ముంపులోనే ఢిల్లీ.. తగ్గని యమునా ఉద్ధృతి..
Advertisement

Delhi flood news live(Telugu news headlines today): దేశ రాజధాని వాసుల కష్టాలింకా తొలగిపోలేదు. మహోగ్రరూపాన్ని దాల్చిన యమునా నది ప్రవాహం తగ్గకపోవడంతో.. ఢిల్లీ వరద కష్టాలింకా తొలగిపోలేదు. ఎక్కడ చూసినా వరదనీటిలో జనాల కష్టాలుపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

హస్తిన వాసులు నడుం లోతు నీటిలో నడుస్తున్న దర్శనమిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచే ఉంది. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వర్షం నీటిలోనే నానుతున్నాయి.

Advertisement

మరోవైపు రాజ్ ఘాట్ దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది. రాజ్ ఘాట్ గేటు కూడా మునిపోయే వరకు నీరొచ్చింది. దీంతో ఆ పరిసరాల్లోకి ఎవరూ వెళ్లడానికి సాహసం చేయడం లేదు. నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లోకి వరదనీరు చుట్టుముట్టగా.. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు.

ఇటు యమునా నది ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. నదీ మట్టం ఇంకా 208.42 మీటర్లు ఉండటంతో.. ఢిల్లీకి ఇంకా ముప్పు తొలగిపోలేదని నీటి శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడం లేదని.. అయినా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మరోసారి భారీ వర్షం కురిసినా.. పరిస్థితి దారుణంగా ఉంటుందని.. హెచ్చరికలు చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×