E-Paper
Advertisement

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్.. కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు..!

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్.. కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు..!
Advertisement

Delhi High Court Equals Kejriwal: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది.

కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు అందజేసింది. ఫిబ్రవరి 17న ఆయన వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

మరోవైపు, కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు ఇవ్వడంపై ఆప్‌ స్పందించింది. న్యాయస్థానం జారీ చేసిన ఆర్డర్‌ను అధ్యయనం చేస్తున్నామని ఆఫ్ నేత జాస్మిన్ షా తెలిపారు. అందుకు తగినవిధంగా చర్యలు తీసుకుంటామమన్నారు.

ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఐదుసార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.తొలుత నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఇవి చట్ట విరుద్ధమని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారని కేంద్రాన్ని దుయ్యబట్టారు.

Advertisement

మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్టయి జైల్లో ఉన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×