E-Paper
Advertisement

Murder: ప్రియురాలి హత్య.. ఫ్రీజర్‌లో మృతదేహం.. మరో అమ్మాయితో పెళ్లి

Murder: ప్రియురాలి హత్య.. ఫ్రీజర్‌లో మృతదేహం.. మరో అమ్మాయితో పెళ్లి
Advertisement

Murder: ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.. ఓ యువకుడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిక్కీ యాదవ్ అనే మహిళను ఆమె ప్రియుడు సాహిల్ గహ్లోత్ హత్య చేసి మృతదేహాన్ని ఓ దాబాలో ఉన్న ఫ్రీజర్‌‌లో దాచాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిక్కీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరపగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిక్కీని కారులో ఛార్జింగ్ కేబుల్‌తో మర్డర్ చేసినట్లు సాహిల్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

నిక్కీ ఢిల్లీ నజఫగర్‌‌లోని ఓ అపార్ట్‌మెంట్లో తన బంధువులతో కలిసి ఉంటూ.. కాలేజీకి వెళ్తోంది. ఈక్రమంలో సాహిల్ అనే యువకుడితో నిక్కీకి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ఈక్రమంలో సాహిల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఈనెల 9న ఆ యువతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నిక్కీ సాహిల్‌ను నిలదీసింది. అతనితో గొడవకు దిగింది. అదే రోజున సాహిల్, నిక్కీ వాళ్ల ఫ్లాట్‌కు వచ్చి కారులో ఆమెను బయటకు తీసుకెళ్లాడు. కారులో కూడా నిక్కీ పెళ్లి ప్రస్తావన తేవడంతో కోపంతో రగిలిపోయిన సాహిల్.. ఛార్జింగ్ కేబుల్‌ను నిక్కీ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కారులోనే ఉంచుకొని 40 కి.మీ ప్రయాణించి తన దాబాకు చేరకున్నాడు. అక్కడ ఫ్రీజర్‌లో మృతదేహాన్ని ఉంచి.. తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

మరునాడు నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే నిక్కీ నాలుగురోజులుగా ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో దర్యాప్తు జరిగిన పోలీసులు దాబాలోని ఫ్రీజర్‌లో నిక్కీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిక్కీ ప్రేమవ్యవహారం తెలిసి..సాహిల్‌‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయట పడింది.

Advertisement

సోస్టుమార్టం రిపోర్టులో కూడా నిక్కీ ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు సాహిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×