E-Paper
Advertisement

Delhi Floods : ఢిల్లీపై ఉప్పెన.. వణికిస్తున్న యమున..

Delhi Floods : ఢిల్లీపై ఉప్పెన.. వణికిస్తున్న యమున..
Advertisement
Delhi Floods

Delhi Flood news latest live(Today’s breaking news in India) : యమునా నది ఉగ్రరూపం కొనసాగుతోంది. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో ఢిల్లీ వాసులు తట్టా బుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. 45 ఏళ్ల తర్వాత యమునా నది ఉగ్రరూపానికి ఢిల్లీ వీధులు నదిలా మారాయి. నదీ పరివాహక ప్రాంతాలు మాత్రమే కాదు.. ఎర్ర కోట వరకు వచ్చేశాయి యమునా నీళ్లు.

Advertisement

208 అడుగులకు పైన నదిలో నీళ్లు ప్రవహిస్తుండటంతో.. ఢిల్లీ గల్లీల్లోకి పోటెత్తింది వరద. యమునా ఘాట్ నుంచి ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎర్రకోట చుట్టూ ఉంటే వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆరు, ఏడుగుల వరకు నీళ్లు వచ్చాయి. దీంతో మంచినీటి సరఫరాకు బ్రేక్ పడింది. కరెంట్ నిలిపివేశారు. జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకోట వరకు వచ్చిన యమునా నీళ్లు.. ఇంకెంత దూరం వరకు వెళతాయి అనేది కూడా స్పష్టంగా చెప్పకలేకపోతున్నారు అధికారులు. మరో 24 గంటలు ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు అధికారులు.

Advertisement

కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కొన్ని కార్యాలయాలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×